Friday, 29 July 2016

Manaloni Bhayyame Dhayyam


మిత్రులారా!
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని కన్నేలురు అనే గ్రామం లో దెయ్యాలు వచ్చి మనుషులు చనిపోతున్నారని ఆ ప్రాంతం ఖాళీ అయ్యే పరిస్తితులల్లో జనవిజ్ఞాన వేదిక కడప జిల్లా తన టీం తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజలను సమస్యలను తెలుసుకొని,వాటికి గల కారణాలను వివరించి, దెయ్యాలు అనేవి లేవని చెప్పి, మంత్రగాళ్ళు వాటి పేరుతో ప్రజలను ఎలా మోసం చేస్తారో వివరించి... అక్కడి ప్రజలను చైతన్యపరిచి.. వారి భయాన్ని పోగొట్టి, అక్కడ వున్న మంత్రించిన వస్తువులను తీసివేసి, నిమ్మకాయలను జిల్లా కమిటి సభ్యుడు బాలబయన్న అక్కడే వారిముందే తిని దెయ్యాలకు, మంత్రగాళ్ళకు సవాల్ విసిరారు.
వెళ్ళిన జనవిజ్ఞాన వేదిక టీం సభ్యులు:
1. తవ్వా సురేష్ - జిల్లా ప్రధాన కార్యదర్శి
2. డి.సుజాన్ కుమార్ - జిల్లా ఉపాధ్యక్షులు, సేనియర్ మేజిసియన్
3.వి. బాల బయన్న - జిల్లా కమిటి సభ్యుడు, మేజిసియన్
4. ఎస్. ఉత్తమా రెడ్డి - జెవివి సభ్యులు, సినీ ఎడిటర్
జెవివి జమ్మలమడుగు శాఖా సభ్యులు, సహకార మిత్రులు.

- తవ్వా సురేష్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప.
9705333305

No comments:

Post a Comment